కాజల్ ఇప్పుడు సూపర్ బిజీగా ఉంది. ఖైదీ నెంబర్ 150 ఏ ముహూర్తాన సైన్ చేసిందో గానీ అప్పట్నుంచి వరస సినిమాలతో దూసుకుపోతుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం తెలుగులో రానాతో నేనేరాజు నేనేమంత్రి సినిమాలో నటిస్తుంది కాజల్. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కాజల్ ఓ పల్లెటూరి అమ్మాయిగా నటిస్తుంది. ఇక తమిళనాట విజయ్ 61వ సినిమాలో.. అజిత్ వివేగంలో ఈ ముద్దుగుమ్మే హీరోయిన్. ఇప్పటికే విజయ్ తో తుపాకి, జిల్లా సినిమాలు చేసింది కాజల్. ఈ రెండు హిట్లే. ఇప్పుడు అట్లీ సినిమాతో హ్యాట్రిక్ పూర్తి చేయబోతుంది. తమిళ్ లో స్టార్ హీరోలతో మాత్రమే నటిస్తోన్న కాజల్.. తెలుగులోకి వచ్చేసరికి మాత్రం రూట్ మార్చేస్తుంది.
వరస విజయాలతో తెలుగు ఇండస్ట్రీకి దూసుకొచ్చిన బాణం రాజ్ తరుణ్. ఆ మధ్య ఒకట్రెండు ఫ్లాపులు వచ్చినా మళ్లీ తట్టుకుని కిట్టుతో హిట్టు కొట్టాడు ఈ కుర్రాడు. మళ్లీ ఇప్పుడు అంధగాడు అంటూ వచ్చాడు. మరి ఇది ఎలా ఉంది..? మరోసారి రాజ్ మాయ చేసాడా..? కథ : గౌతమ్(రాజ్ తరుణ్) కు కళ్ళు కనిపించవు. చిన్నప్పట్నుంచీ అంధుడే. జీవితంలో కళ్లు ఉంటే చాలు.. ఇంకేమీ అక్కర్లేదనుకునే మనస్తత్వం గౌతమ్ ది. అలాంటి గౌతమ్ కు నేత్ర(హెబ్బాపటేల్) తో పరిచయం అవుతుంది. కళ్లు లేకపోయినా ఉన్నట్లు యాక్ట్ చేసి ఆమెను లవ్ లో పడేస్తాడు. కానీ తర్వాత నిజం తెలిసి వదిలేసి వెళ్లిపోతుంది. ఆ వెంటనే గౌతమ్ కు కళ్లు వస్తాయి. కానీ వచ్చిన తర్వాత అసలు సమస్య మొదలవుతుంది. దాంతో తన కళ్లు తీసేయాలంటూ డాక్టర్ ఆశిష్(ఆశిష్ విధ్యార్థి) దగ్గరికి వెళ్తాడు. గౌతమ్ జీవితంలోకి ఉన్నట్లుండి కులకర్ణి(రాజేంద్రప్రసాద్) ప్రవేశిస్తాడు. ఏకంగా మర్డర్లే చేయిస్తాడు. అసలు కులకర్ణికి, గౌతమ్ కు సంబంధం ఏంటి..? ఎందుకు మర్డర్లు చేస్తాడు..? ఇవన్నీ మిగిలిన కథ.. కథనం : వెలిగొండ శ్రీనివాస్ ఇప్పటి...
Comments
Post a Comment